ఏపీలో నమో అంటే.. నాయుడు, మోదీ అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్కులో బ్లూజెట్ హెల్త్కేర్ లిమిటెడ్ పరిశ్రమకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు కాదు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తోందని పేర్కొన్నారు.