వెనుకబడిన ప్రాంతం ఆదోని డివిజన్ను జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోనిలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటులో నష్టపోయింది ఆదోని ప్రాంతమే అన్నారు. అఖండ మెజారిటీతో కొలువుదీరిన చంద్ర బాబు నాయుడు కూటమి ప్రభుత్వం కలలను సాకారం చేస్తుందనే నమ్మకంతో ప్రజలున్నారన్నారు.