ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటా గరిష్ట ధర రూ. 6, 350 పలికింది. శుక్రవారంతో పోలిస్తే వేరుశనగ ధర రూ. 3, 269 పెరిగింది. వేరుశనగ కనిష్ట ధర రూ. 5, 120, పత్తి గరిష్ట ధర రూ. 7, 592, కనిష్ట ధర రూ. 4, 002, ఆముదం గరిష్ట ధర రూ6, 819, కనిష్ట ధర రూ. 2, 816 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పంట ఉత్పత్తులను సమయానికి తీసుకొచ్చి అధికారులకు సహకరించాలని కోరారు.