వరంగల్లో జూలై 7న జరిగే మాదిగల ఆత్మగౌరవ కావత్ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ, బండారి గిడ్డయ్య మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలోని అమరావతి నగర్ వడ్డేగేరి వార్డు కమిటీని ఎన్నుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు ఆత్మగౌరవ కవత్కు మాదిగలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.