ఆళ్లగడ్డ పట్టణంలోని మెయిన్ బజార్లో శనివారం రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆళ్లగడ్డ ఆవోప ఆర్యవైశ్య సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుంటూ, వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సజ్జల నాగేంద్ర పాల్గొన్నారు.