బేతంచెర్ల మండలంలో కురిసిన అకాల వర్షం, గాలులతో కూడిన వాతావరణం వల్ల అరటి తోటలు నేలకూలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రవరం గ్రామానికి చెందిన రైతు నాగరాజు తన 3 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతినడంతో సుమారు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. చేతికి వచ్చే సమయంలోనే పంట నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటల మధ్య ఉన్న అరటి పంట కూడా భారీగా దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.