చాగలమర్రి: పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి

రైతులు పంటల సాగులో సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని చాగలమర్రి మండల వ్యవసాయ అధికారి రంగ నేతాజీ సూచించారు. బుధవారం చింతలచెరువులో జరిగిన "పొలం పిలుస్తుంది" కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు అందించారు. మొక్కజొన్న సాగులో అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. పంటల బీమా నమోదు ఈ నెల 15లోపు మీ సేవా కేంద్రాల్లో పూర్తిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్