ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. బొత్స సత్యనారాయణ, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తదితరులు గురువారం రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ పథకాల అమలులో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికీ వివక్ష చూపిస్తున్నారని, సీఎం చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.