బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన బాణా విజయచంద్రా రెడ్డి, శరణ్య దంపతులు గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వీరు కష్టపడి చదివి రెవెన్యూ శాఖలో ఏఎస్ఓ ఉద్యోగాలు పొందారు. వీరి విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని వీరు నిరూపించారు.