బేతంచెర్ల మండలం బైనపల్లెలోని నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 16న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. దాతల సహకారంతో విజేతలకు రూ.40,000 నుండి రూ.5000 వరకు నగదు బహుమతులు అందజేస్తామని గ్రామస్థులు తెలిపారు. ఈ పోటీలు ఆలయ ఉత్సవాల్లో భాగంగా జరుగుతాయి.