గూడూరు మండలం కె. నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసులో సోమవారం ప్రధాన నిందితుడు రమేష్తో పాటు ఇద్దరు బాల నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బాధితులను కారులో ఎక్కించి, పెద్దపాడు వద్ద దోచుకొని రూ. 12వేలు ఫోన్పే తో ట్రాన్స్ఫర్ చేసి, రూ. 6, 500 నగదు తీసుకుని కారునుంచి తోసివేశారు. పోలీసులు కారు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.