ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం కర్నూలు పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపు, రైతుల అకౌంట్లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామని అన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తాంమని,రాయలసీమను హార్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని, ఓర్వకల్కి రైల్వే ట్రాక్ తీసుకొస్తామని అన్నారు.