మంత్రాలయం - ఎమ్మిగనూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం ఎస్సై గోపీనాథ్ తెలిపిన వివరాల మేరకు. మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లు దేవకుంట గ్రామ సమీపంలో డీసీఎం, బొలెరో వాహనం ఢీకొన్నాయి అన్నారు. డీసీఎంను బొలెరో వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.