కాలనీలో పర్యటించిన ఏపీ రైతు సంఘం

నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పగిడ్యాల రోడ్డులో ఉన్న బైరెడ్డి నగర్ ఆచారి కాలనీలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు గురువారం పర్యటించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వర్షపు నీరు రోడ్లపై చేరి ఇళ్లల్లోకి చేరుతుండడంతో తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్- చైర్మన్ కలసి వర్షపు నీటిని బయటికి పంపే విధంగా చర్యలు చేపట్టాలని, లేదంటే కాలనీవాసులను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్