పాణ్యం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రివర్స్ లో వస్తున్న లారీని వెనుకుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వస్తున్న కొణిదెడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.