పత్తికొండలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు

పత్తికొండలో వినాయక నిమజ్జనం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమర్జనం కార్యక్రమలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు వయోభేదం లేకుండా నిమర్జనం కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యలతో ఊరేగింపులో పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలు హోరెత్తాయి. హోసూరు బైపాస్ లోని హంద్రీనీవా వద్ద నిమర్జన కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్