జాబ్ మేళా నిరుద్యోగులకు వరం: ఎమ్మెల్యే

జాబ్ మేళా నిరుద్యోగులకు వరమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 95 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఐదు కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 41 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్