కేజీబీవీలో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు

వెల్దుర్తిలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్లో 10, సెకండియర్ లో 9 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎంఈవో రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి భర్తీకి సంబంధించి మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి ఎక్కడా ఇంటర్ లో చేరని బాలికలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు గుర్తించాలన్నారు. గుర్తించిన బాలికల తల్లిదండ్రులకు నచ్చజెప్పి పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్