శ్రీశైలం జలాశయానికి మంగళవారం ఉదయం వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగింది. జూరాల ద్వారా 5,598 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, అవుట్ఫ్లో నిల్గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.80 అడుగుల వద్ద నిలిచింది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నిల్వ 203.429 టీఎంసీలుగా అధికారులు వెల్లడించారు.