సంగం మండలం గాంధీజన సంఘం సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పిన ఆటో బోల్తా పడటంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై భోజ్యా నాయక్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం తరలించారు.