మంత్రి నాదెండ్ల మనోహర్ను అనంతసాగరం మండలం జనసేన పార్టీ నాయకులు నెల్లూరులో కలిసి పంట నష్టంపై వినతిపత్రం సమర్పించారు. కామిరెడ్డిపాడు, చిలకలమర్రి గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయని వారు వివరించారు. నష్టపోయిన రైతులకు తక్షణం ఆదుకుని సరైన పరిహారం అందించాలని వారు మంత్రిని కోరారు.