కందుకూరులోని పామూరు రోడ్డులో సింహాద్రి నగర్ ప్రాంతంలో మంగళవారం ఓ పిచ్చికుక్క ఐదుగురిని కరవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పిచ్చికుక్కను పట్టుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.