కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వైసీపీ నాయకుల ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు. పొగాకు వేలం కేంద్రంలో రైతులను బెదిరించేలా మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. రైతుల సమస్యలపై అవగాహన లేకుండానే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహానాడును పార్టీ శ్రేణుల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని, కార్యకర్తల కృషితో కందుకూరు నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.