కావలి పట్టణం వెంగయ్యగారిపాలెం వినాయకస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న రాజవరపు చంద్ర హాసన్ (19) అనే బీసీఏ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే కావలి ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.