కొడవలూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం కిషోర్ బాలికలకు వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరమ్మ, నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికల ఆరోగ్యం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. గుడ్ టచింగ్, బ్యాడ్ టచింగ్ గురించి వివరించారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 1098కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ప్లా కార్డులతో ప్రదర్శన నిర్వహించారు.