బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని నాలుగో వార్డు కృష్ణ హాల్ దగ్గర బుధవారం పింఛన్దారులకు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మోర్ల సుప్రజ మురళి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.