నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామంలో చిన్నారుల కిడ్నాప్ అనుమానంతో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని గ్రామస్థులు గుర్తించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకుని నలుగురిని స్టేషన్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.