మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో సెజ్‌లో ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈనెల 6న ఉదయం 10 గంటలకు భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్