ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకులు అంబటి రాంబాబు చేసిన సంస్కార రహిత వ్యాఖ్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సభ్యతా సంస్కారాలు మరిచి నోరు పారేసుకునే వైసిపి నేతల నోళ్లు మూయించేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. వైసిపి నాయకుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.