కోవూరులో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాపై ప్రత్యేక నిఘా ఉంచి, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా, అనర్హ ఓట్లు చట్టబద్ధంగా తొలగించేలా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పించారు. కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఖాయమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.