ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు. శనివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని సమస్యలు లేని నగరంగా మార్చాలని అందుకు అధికారులు నైతిక బాధ్యత వహించాలన్నారు.