హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే అవకాశాలను పరిశీలించి, పెట్టుబడుల ఆకర్షణపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.