నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనధికారిక లే అవుట్లకు ఐపీఎల్పీ మంజూరు, ప్లాట్లకు చట్టబద్ధ హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకంపై గురువారం ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి. శ్రీనివాసులు, రీజనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మధు కుమార్ పాల్గొంటారని నగర కమిషనర్ వైవో నందన్ తెలిపారు. ఈ ఫోరం ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంది.