తహశీల్దార్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో పర్యటించినప్పుడే సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపగలుగుతారని భూపరిపాలన ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి అన్నారు. శనివారం నెల్లూరు నగర పర్యటనకు విచ్చేసిన ఆమె, కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్వో హుస్సేన్సాహెబ్ పాల్గొన్నారు.