ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ సి. ప్రేమ్ దీప్ మాట్లాడుతూ, ఆస్తమా నియంత్రణకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, ఈ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంగళవారం, స్థానిక సంజయ్ గాంధీనగర్ లోని శ్రీ లక్ష్మీసాయి ప్రధమ చికిత్సలయం నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆస్తమా నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.