నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ చాంబర్లో, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ రూప్ కుమార్ యాదవ్, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు కమిషనర్ వై. ఓ నందన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, హౌసింగ్ విభాగాల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో ప్రస్తుతం 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.