ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందని మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పొదలకూరు మండలంలోని బిరదవోలులో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం పేదలకు వైద్యం, వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.