జిల్లాలో నీటి వనరుల సమర్థ వినియోగం, భూగర్భ జలాల పెంపుదలకు 'జలధార-జలహారతి - సాగు నీటి సంఘాల బాధ్యత' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, జిల్లాలోని వివిధ బేసిన్లు, ఉప బేసిన్లలో నీటి లభ్యతపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.