వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ముగిసింది. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో వచ్చి, మొదటగా నెల్లూరు జైలులోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం సుజాతమ్మ కాలనీలో ప్రసన్న నివాసానికి వెళ్లి, మీడియాతో మాట్లాడారు. చివరిగా హెలిప్యాడ్కు చేరుకుని బెంగళూరుకు బయలుదేరారు. నేతలు వీడ్కోలు పలికారు.