ఐద్వా నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 17వ డివిజన్ జక్కా వెంకయ్య భవన్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది. అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ వి. స్రవంతి ముఖ్య అతిథిగా పాల్గొని, క్యాన్సర్ కారక రుగ్మతలను ముందుగా ఎలా గుర్తించాలో మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రూరల్ కార్యదర్శి షాహినా బేగం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.