నెల్లూరులోని దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం కోటి సోమవారం సందర్భంగా శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకరుద్రాభిషేకాలు, పాలాభిషేకాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.