పొదలకూరు మండలంలోని మొగుళ్ళూరులో జనసేన నాయకులు నాగరాజు, తిరుపతి, కుమార్, ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం వనంతోపు సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నాగరాజు తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకు ఇది కొనసాగుతుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు పాపిశెట్టి విష్ణు, వెంకటేశ్వర్లు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.