మనుబోలు వైయస్సార్ జంక్షన్ వద్ద చెన్నై నుంచి నెల్లూరు వెళ్తున్న కారును నెల్లూరు వైపే వెళ్తున్న మహేంద్ర ట్రక్ ఢీకొనడంతో కారు వెళ్లి డివైడర్ ఎక్కింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరింది. కారులో నలుగురు ప్రయాణం చేస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే భయానకంగా ఉంది. జనాలు రోడ్డుపైకి గుంపులు గుంపులుగా రావడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది.