నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం మనుబోలు జగనన్న కాలనీలో పర్యటించి మీడియాతో మాట్లాడుతూ, పేదలకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఇళ్లు, స్థలాలు ఇచ్చి ఊర్లు నిర్మించామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ, మోసం చేసిన ఘనత చంద్రబాబుదని ఆరోపించారు.