విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న న్యాయశాస్త్ర పరీక్షల నిర్వహణను వైస్ ఛాన్సలర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరులోని వీఆర్ఐపీఎస్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షల పారదర్శకత, క్రమశిక్షణ, నాణ్యతా ప్రమాణాల అమలు తీరును పరిశీలించారు. పరీక్షా హాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యార్థుల హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధులు, ప్రశ్నపత్రాల పంపిణీ వంటి అంశాలను ఆయన నిశితంగా పరిశీలించారు.