సర్వేపల్లి మాజీ మంత్రి కాకాణి శ్రీధర్పై ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన ఆరోపణలపై, ఇందుకూరుపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ కోసం శనివారం పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంటారని పోలీసులు తెలిపారు.