జగన్ లిక్కర్ స్కాం సినిమాగా తీస్తే 'పుష్ప' కంటే పెద్ద హిట్ అవుతుందని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎద్దేవా చేసారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చీప్ లిక్కర్ వల్ల 30 వేలమంది చనిపోయారని, వారి కుటుంబాలు అనాథలయ్యాయని అన్నారు. జగన్ సొంత బ్రాండ్లు, లేబుళ్లతో మత్తుకు బలిచేశారని ఆరోపించారు. జగన్ నరహంతకుడివి, నీ పాపాలన్నీ ప్రజలు చూసారని విమర్శించారు.