బద్దేవోలు గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉదయం కామాక్షి అమ్మవారికి పంచామృత అభిషేకము అనంతరం వివిధ రకాల పూలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అనంతరం సాయంత్రం గ్రామంలోని మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.