ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో, జిల్లా పరిధిలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్పై ఎస్పీ డా. అజిత వేజెండ్ల యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్కు బానిసలై కొందరు యువకులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ను కేవలం వినోదం కోసం చూడాలని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపితే అది ఊబి లాంటిదని, దాని నుంచి బయటపడటం కష్టమని ఆమె అన్నారు.