పొదలకూరు మండలం చీరేల సిద్ధూరూ కాలనీలో చేనేత కార్మికుల భూముల ఆక్రమణలను అడ్డుకుంటున్న చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్రావుపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఐక్య రాష్ట్రాల కమిటీ సభ్యులు ఖండించారు. భూమి కొలతల ప్రక్రియ జరుగుతున్న సమయంలో భూ కబ్జాదారులు ఇనుప రాడ్డుతో దాడి చేయడం దుర్మార్గమని, నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.